అశ్విన్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'హిడింబా'.
|
అశ్విన్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయిక. అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. గంగపట్నం శ్రీధర్ నిర్మాత. శుక్రవారం హైదరాబాద్లో ప్రముఖ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ ‘‘అశ్విన్ నాకు క్రికెట్ గ్రౌండ్లో పరిచయం. ఇద్దరం మంచి స్నేహితులం అయిపోయాం. ‘హిడింబ’ ట్రైలర్ అదిరిపోయింది. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘నా కెరీర్లోనే భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రమిది. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు ఈ కథని తెరకెక్కించిన విధానం కొత్తగా ఉంటుంద’’న్నారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|