ఇంత నిర్దయా?
ఆమదాలవలసలోని సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీలో ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు చేశారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ నెల మూడు నుంచి ఆరోతేదీ వరకూ సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులు, నడవలేని స్థితిలో ఉన్న లబ్ధిదారులకు.. ఇంటివద్దకు వెళ్లి పింఛన్లు అందజేయాలని స్పష్టం చేసింది. కాగా.. గురువారం ఆమదాలవలస మునిసిపాలిటీలోని పలు సచివాలయాల్లో కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలాల సచివాలయ ఉద్యోగులు ఉదయం 11 గంటల వరకు హాజరుకాలేదు. దీంతో వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులు గంటల తరబడి నిరీక్షించారు. అలాగే ఆమదాలవలస మునిసిపాలిటీ మోనింగివారివీధిలోని సచివాలయం- 1, 2 కేంద్రాల్లో కొంతమంది పింఛన్‌దారులు కుటుంబ సభ్యుల సాయంతో ఆటోలు, ద్విచక్రవాహనాలపై వచ్చి పింఛన్‌ తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులెవరూ పింఛన్‌దారుల ఇంటికి వెళ్లే దాఖలాలు కనిపించలేదు.
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News Local News
విజయనగరం ఓటరు మహాశయులకు విజ్ఞప్తి! [04 05 2024 01:03 pm]
ఇంత నిర్దయా? [05 04 2024 05:15 pm]
అంగన్‌వాడీల తొలగింపు! [23 01 2024 04:45 pm]
సమాయత్తం [18 12 2023 05:24 pm]
మంచి పాలన అందిస్తాం [08 12 2023 04:50 pm]
సంకల్ప దీక్ష [20 11 2023 04:52 pm]
బొబ్బిలి- సాలూరు [13 09 2023 02:27 pm]
ఎన్‌ఎండీసీకి [22 08 2023 02:47 pm]
విద్యార్థుల ‘మహా [01 08 2023 03:30 pm]
ఆర్మీ ర్యాలీకి [20 07 2023 02:50 pm]
విశాఖకు [28 06 2023 02:48 pm]
చంద్రబాబు బిజీగా [20 05 2023 04:17 pm]
ప్రభుత్వం గొప్పలు [18 05 2023 02:07 pm]
ముద్రా రుణం ద్వారా [16 05 2023 03:07 pm]
ముఖ్యమంత్రికి ఘన [04 05 2023 03:54 pm]
విశాఖ కిడ్నీ [29 04 2023 10:04 am]
bottom
rightpane