|
అప్పన్న నిజరూప దర్శనానికి నేటి నుంచి టికెట్ల విక్రయం
|
ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న స్వామి ఈ నెల 10న నిజరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునేందుకై ఈరోజు నుంచి 7 వరకు టికెట్లు అమ్మకాలు జరుగనున్నాయి. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం నిర్వహించనున్నారు. స్వామివారి నిజరూప దర్శన టికెట్ల విక్రయం ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభంకానుంది.ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న స్వామి (Simhachalam Appanna Temple) ఈ నెల 10న నిజరూపంలో భక్తులకు (Devotees) దర్శనం ఇవ్వనున్నారు. స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునేందుకై ఈరోజు నుంచి 7 వరకు టికెట్లు అమ్మకాలు జరుగనున్నాయి. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం నిర్వహించనున్నారు. స్వామివారి నిజరూప దర్శన టికెట్ల విక్రయం ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రూ.300, రూ.వెయ్యి టికెట్లు బ్యాంకుల ద్వారా, సింహగిరిపై టికెట్ల విక్రయ కేంద్రాల ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|